కోడుమూరులో దోమల నివారణకు చర్యలు

61చూసినవారు
కోడుమూరు పట్టణంలో గ్రామ సర్పంచ్ భాగ్యరత్న, ఈవో అజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం దోమల నివారణకు చర్యలు చేపట్టారు. కొండపేట, వసతి గృహాల్లో ఫాగింగ్ చేయించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంకు తదితర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. మురుగు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా, దోమల నివారణకు ఏసీఎం ద్రావణాన్ని ఇంటింటికీ పిచికారీ చేయించారు.

సంబంధిత పోస్ట్