కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదిమూలపు సతీష్ భార్య స్టెల్లా సతీష్, కూతురు రీతూ జాస్మీన్ లు గురువారం కోడుమూరులోని బేపారం, తేరుబజార్, బోయ వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల సంక్షేమ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జగనన్నను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, కృష్ణారెడ్డి, హనుమంతు, కార్యర్తలు పాల్గొన్నారు.