గూడూరు మండలస్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను బుధవారం మున్సిపల్ ఛైర్మన్ జులపాలు వెంకటేశ్వర్లు, ఎంపీపీ సునీత ప్రారంభించారు. నగర పంచాయతీ స్థాయిలో క్రీడాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణంలో ఎంపీడీవో రాముడు ఆధ్వర్యంలో నిర్వహించారు.
క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారులను పరిచయం చేసుకొని, ఆడించారు. అనంతరం ఎంపీపీ సునీత మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలని సూచించారు.