ఢిల్లీలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం జరిగింది. మీట్ చౌక్ సమీపంలోని గౌతంపురి ప్రాంతంలో గౌరవ్ అకా లంబు (22) అనే యువకుడిపై దుండగులు దాడి చేశారు. కత్తులతో గౌరవ్ను విచక్షణా రహితంగా పొడిచారు. అనంతరం బాధితుడిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారు. తీవ్ర గాయాలతో బాధితుడు చనిపోయాడు. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.