పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సోమవారం గూడూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలన్నారు.