ఓర్వకల్లు మండలం పూడిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కల్వర్టును బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఓర్వకల్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.