విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం

546చూసినవారు
విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం
కౌతాళం మండలం బదినేహాల్ గ్రామంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల శనివారం గుడిసె దగ్ధమైంది. దీంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి, గ్రామానికి చెందిన ఇమామ్ వలి అనే రైతు ఇంట్లో ఉంచిన పత్తి , ఇంటి సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ. 6 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు తమవని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్