పెద్ద కడుబూరు - Peda Kaduburu

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
బీజేపీకీ యువత ఆకర్షితులయ్యారు : బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
May 08, 2024, 15:05 IST/చేవెళ్ల
చేవెళ్ల

బీజేపీకీ యువత ఆకర్షితులయ్యారు : బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

May 08, 2024, 15:05 IST
బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు,విద్యకు ఇస్తున్న ప్రియారిటీ చూసి యువత ఉత్సాహంగా బీజేపీలో చేరుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పలువురు యువకులు బీజేపీకి ఆకర్షితులై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. బీజేపీ అంటేనే అభివృద్ధి ఒక చేయూత లాంటిది అని అన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. యువతకు ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది బీజేపీ అని గుర్తు చేశారు. యువత స్వచ్చంధంగా వచ్చి బీజేపీ లో చేరడం నిజంగా శుభ పరిణామమని కొనియాడారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న సూక్తికి మోడీ ఎంతగానో న్యాయం చేస్తున్నారని అన్నారు. విద్యకు మంచి ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి ప్రధాని మోడీ అన్నారు. మోడీ ఆలోచనే వేరని మోడీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.