విజయవాడలోని ఏ కన్వెన్షన్ నందు మంగళవారం ఎన్డీఏ కూటమిలోని టిడిపి, జనసేన, బిజెపి శాసనసభ పక్ష సమావేశానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించగా ఆయన మద్దతు తెలిపారు. అనంతరం నారా లోకేష్ తో పాటు పలువురు నాయకులతో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.