భారత్ మరో కీలక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. FIH పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ భారత గడ్డపై జరగనున్నట్లు భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టర్కీ తెలిపారు. ఈ అవకాశమిచ్చిన FIH అధ్యక్షుడు డాటో టయ్యాబ్ ఇక్రమ్ కు ధన్యవాదాలు తెలిపారు.
భారత్ ఈ పోటీలకు ఆతిథ్యమివ్వడం ఇది నాలుగో సారి. అంతకుముందు 2013, 16, 21లో ఈ పోటీలు జరిగాయి. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ టోర్నీ జరగనుంది.