కామేశ్వరి దేవి దసరానవరాత్రిఉత్సవాలకు పట్టువస్త్రాలు విరాళం

53చూసినవారు
కామేశ్వరి దేవి దసరానవరాత్రిఉత్సవాలకు పట్టువస్త్రాలు విరాళం
మహానంది పుణ్యక్షేత్రంలో జరిగే శ్రీ కామేశ్వరీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పట్టువస్త్రాలు విరాళంగా గురువారం అందజేశారు. 2024 కామేశ్వరీ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారి మూలమూర్తుల అలంకరణకు 10 పట్టుచీరలను హైదరాబాద్ కు చెందిన వారణాసి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి దంపతులు ఆలయ ఏఈఓ మధుకు భక్తితో అందజేశారు. గత 20 సంవత్సరాలకు పైబడి ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఉండడంవిశేషం.

సంబంధిత పోస్ట్