మల్లన్నకు పసిడి నాగాభరణం బహుకరణ

60చూసినవారు
శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఒడిశా రాష్ట్రం, రాయఘడ్ జిల్లా గుణుపూరుకు చెందిన జి. గోపాలరావు అనే భక్తుడు బుధవారం బంగారు నాగాభరణాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో దాతలు ఆలయ ప్రధానార్చకులు ఉమానాగేశ్వరశాస్త్రి పర్యవేక్షకుడు అయ్యన్న, ఆలయం ఇన్స్ స్పెక్టర్ మల్లికార్జునకు 45 గ్రామలు బరువైన ఆభరణాన్ని అందజేశారు. అధికారులు దాతకు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్