AP: బోరుగడ్డ అనిల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను శుక్రవారం అనంతపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల త్రీ టౌన్లో నమోదైన కేసును ఈనెల 10కి మొబైల్ కోర్టు వాయిదా వేసింది. అనంతరం అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనంతరంపురం పోలీసులు తరలించారు.