అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి బెంగళూరుకు చెందిన దీపాంజలి (14) అనే ఏళ్ల బాలిక మరణించింది. అయితే బాలికకు రోజు అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉండటంతో అదే రకమైన బ్యాటిల్లో పురుగుల మందు ఉండటంతో జ్యూస్ అనుకొని తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.