AP: ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంపై మాజీ మంత్రి రోజా తొలిసారి స్పందించారు. "చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడిపోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!" అని పేర్కొంటూ ఆమె 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. నగరిలో రోజాపై టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ రెడ్డి 45వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.