అంబటి, అనిల్ యాదవ్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ ‘సిద్ధం’ సభలో డ్రోన్ను చూసి భయపడుతున్నారని విమర్శించారు. ‘శంఖారావం’ సభలో లోకేశ్ మాట్లాడుతూ అంబటి అరగంట స్టార్, అనిల్ బెట్టింగ్ స్టార్! అని అన్నారు. లోకేశ్ ఓ డ్రోన్ పంపి ఖాళీ కుర్చీలు చూపేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి, అనిల్ అన్నారన్నారు. ’సిద్ధం‘ సభకు ప్రజలు సిద్ధంగా లేరని ఆ ఇద్దరు దొంగలు తేల్చి చెప్పేశారని లోకేశ్ ఆరోపించారు.