ఈ నెల 11న మద్యం షాపులకు లాటరీ

73చూసినవారు
ఈ నెల 11న మద్యం షాపులకు లాటరీ
ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రక్రియ ప్రారంభమైందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. నేటి నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుందని అన్నారు. 11న రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు లాటరీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైందని చెప్పారు. ఇక ప్రీమియర్ షాపులకు, గీత కులస్తులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్