తాడిపత్రిలో వ్యక్తి దారుణహత్య (వీడియో)

54చూసినవారు
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పడమటగేరి వీధిలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు నూరుల్లా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్