ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు. విజయవాడలో ఆదివారం కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ‘అన్ని ప్రాంతాల్లోని నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సాహిస్తాం. మంగళగిరి, కడపలో కూడా అంతర్జాతీయ మ్యాచులు జరిగేలా చర్యలు చేపడతాం.’ అని అన్నారు.