AP: పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో తాను పడ్డ కష్టాన్ని మాజీ సీఎం జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. "పోలవరం కట్టడానికి ఆటంకాలు రాకూడదనే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించా. టీడీపీ హయాంలోనే ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది." అని మీడియాతో సీఎ అన్నారు.