పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి

54చూసినవారు
పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి
గర్భిణులు, బాలింతలు పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ లీలావతి సూచించారు. శుక్రవారం ఆదోని మండలం మదిరెలో పోషకాహార మహోత్సవాలను నిర్వహించి, పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకుంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుందన్నారు. పాలు, గుడ్డు ఆకు కూరలు, పప్పు దినుసులు వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే తల్లి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్