వేసవి వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అవసరమైతే తప్ప పదకొండు తర్వాత బయటికి రాకూడదని ఆళ్లగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నరసింహ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే రోగులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహ మాట్లాడుతూ వేసవిలో ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఎండలో బయటికి రాకూడదన్నారు.