ఆళ్లగడ్డ పట్టణం లోని ఎల్ఎం కాంపౌండ్ కు చెందిన 40 కుటుంబాల వారు గురువారం టీడీపీ, తదితర పార్టీలను వీడి వైసీపీలో చేరారు. నంద్యాల విజయ మిల్క్ డైరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఎంతమంది ఏకమైనా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు.