వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందే తప్ప ప్రజలకు చేసిందేమీలేదని మాజీ ఎమ్మెల్యే కోట్లసుజాతమ్మ అన్నారు. మంగళవారం డోన్ మండలంలోని వలసల గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన ఇద్దరు కలిసి రూ. లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన భారం మోపారని మండిపడ్డారు.