సుంకేసులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

53చూసినవారు
ఎగువ నుంచి వస్తున్న వరద నీరు సుంకేసుల జలాశయానికి చేరుతుంది. సోమవారం కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు 11, 337 క్యూసెక్కుల నీరు వస్తుందని జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో డ్యాం నుంచి 2 గేట్లు ఎత్తి 8, 892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు, అలాగే కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 194 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్