తిరుపతి లడ్డు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ సి. బెళగల్ మండలంలోని క్రిష్ణదొడ్డిలో కోన వెంకటేశ్వరస్వామికి, కోడుమూరులోని 1వ వార్డులో ఉన్న శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఆదిమూలపు సతీష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ శ్రేణులు భారీగా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.