విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు నందికొట్కూరు నియోజకవర్గం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బి. వెంకటరమణ ఆధ్వర్యంలో.. వైద్యులు తమ వంతు సహకారంగా ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 65,800-, చెక్కును మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వనజ, కుమార్, ఎం ఎం భాష, రమణారెడ్డి, సలీం, మహమ్మద్ భాష, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.