వరద బాధితులకు ఆర్థిక సహాయం

66చూసినవారు
వరద బాధితులకు ఆర్థిక సహాయం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు నందికొట్కూరు నియోజకవర్గం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బి. వెంకటరమణ ఆధ్వర్యంలో.. వైద్యులు తమ వంతు సహకారంగా ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 65,800-, చెక్కును మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వనజ, కుమార్, ఎం ఎం భాష, రమణారెడ్డి, సలీం, మహమ్మద్ భాష, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్