పాణ్యం: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి

69చూసినవారు
పాణ్యం: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. సోమవారం కల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 113 వినతులు నమోదయ్యాయి. ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలు మరలా రిపీట్ కాకుండా అధికారులు చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్