![ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా: కాటసాని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా: కాటసాని](https://media.getlokalapp.com/cache/91/77/91770a818dce50a22ca8188f06abea07.webp)
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా: కాటసాని
పాణ్యంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యకర్తలతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమిపై కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహానికి గురి కావద్దని సూచించారు. కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కూడా ఆయన చర్చించారు.