నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని వినాయకుడిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం దర్శించుకున్నారు. అక్కడికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక ప్రజలతో కొంతసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.