బోగోలు మండలంలోని బిట్రగుంట టపాసుల గోడౌన్ లో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది.ఈ ప్రమాదంలో గోడౌన్ యజమాని సుమంత్ తో పాటు ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.