నెల్లూరు చేరుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పాదయాత్ర

56చూసినవారు
నెల్లూరు చేరుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పాదయాత్ర
చంద్రబాబు సీఎం అయిన సందర్భంగా కావలి ప్రభుత్వ ఉపాధ్యాయులు తిరుమల వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం వారు నెల్లూరు టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు. టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి వారికి స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు నరకయాతన అనుభవించారని, మన ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని చేజర్ల అన్నారు.

సంబంధిత పోస్ట్