కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

560చూసినవారు
కావలి పట్టణంలోని పదో వార్డులో సోమవారం ఉదయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. ప్రజలతో మాట్లాడుతూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడిపి ప్రభుత్వం రాగానే వారి సమస్యలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్