మైపాడు బీచ్ లో సందడి వాతావరణం

70చూసినవారు
నెల్లూరు నగరంలో రొట్టెల పండగ ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా భారాషాహీద్ దర్గాను దర్శించుకున్న భక్తులు యాత్రికులు ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్ ను సందర్శిస్తున్నారు. శనివారం జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. కాసేపు ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొన్నది. అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్