విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ రామిశెట్టి స్వాతి, టిడిపి నేతలు వెంకటేశ్వర్లు , బాలకృష్ణ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.