ప్రజలకు అవసరమైన పనులు గుర్తించండి: ఎమ్మెల్యే

72చూసినవారు
ప్రజలకు అవసరమైన పనులు గుర్తించండి: ఎమ్మెల్యే
వెంకటగిరి నియోజకవర్గంలో అధ్వానంగా వున్న రోడ్లును గుర్తించి ప్రతి పాదనలు సిద్ధం చేస్తే మరమ్మతులకు నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే కె. రామకృష్ణ అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అధ్వానపు రోడ్లపై ప్రయాణించలేక నరకం అంటే ఏమిటో చూశారన్నారు. గతంలో అడ్డగోలుగా మంజూరు చేసిన పనులను రద్దు చేయాలని, ప్రజలకు అవసరమైన పనులు గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్