ఏఐపై డెల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అతుల్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఏఐ సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు. 2027 నాటికి చాలావరకూ కంప్యూటర్లు ఏఐ ఆధారిత టెక్నాలజీతో యూజర్ల ముందుకొస్తాయని చెప్పారు. తాము ప్రస్తుతం ఏఐ ఆధారిత పీసీల లాంఛింగ్పై దృష్టి సారించామని చెప్పారు. ఏఐ డివైజ్లు మనుషులకు మరింత ఉత్పాదకతను జోడించడమే కాకుండా సమర్ధవంతంగా పనిచేస్తాయని మెహతా పేర్కొన్నారు.