మారిటైమ్ బౌండరీని గుర్తిస్తూ భారత్, శ్రీలంక మధ్య రెండు ఒప్పందాలు జరిగాయి. 1974లో జరిగిన మొదటి ఒప్పందం ప్రకారం కచ్చతీవు శ్రీలంకకు చెందుతుందని తేల్చారు. 1976 మార్చిలో జరిగిన రెండో ఒప్పందం ప్రకారం వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం భారత్కు వచ్చింది. వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం మరియు వనరులపై భారత్ సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది. దీని ప్రకారం వాడ్జ్ బ్యాంక్లో శ్రీలంక మత్స్యకారులు, నౌకలు చేపలు పట్టడానికి వీల్లేదు.