పవన్ కళ్యాణ్పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "పవన్ కాపు జాతికి తీరని ద్రోహం చేస్తున్నాడు. తన ధనార్జన కోసం కాపులను ఇబ్బందులు పెడుతున్నాడు. ఎటువంటి సిద్ధాంతం లేని పార్టీ జనసేన. ప్యాకేజీనే లక్ష్యంగా పవన్.. పార్టీ నడుపుతున్నాడు. జనసేన కాదు అది ప్యాకేజీ సేన. తాడేపల్లిగూడెంలో ఎప్పుడు ఎక్కడ గొడవలు జరిగిన అక్కడ జనసేన కార్యకర్తలే ఉంటున్నారు." అని మంత్రి మండిపడ్డారు.