ఇప్పుడు జ‌గ‌న్‌ను వాళ్లు మాత్ర‌మే కాపాడ‌గ‌ల‌రా..!

60చూసినవారు
ఇప్పుడు జ‌గ‌న్‌ను వాళ్లు మాత్ర‌మే కాపాడ‌గ‌ల‌రా..!
ఏపీ రాష్ట్రం నుంచి వైసీపీకి మాత్ర‌మే రాజ్య‌స‌భ‌లో ప్రాతినిధ్యం ఉంది. ఏకంగా 11 మంది స‌భ్యులు వైసీపీకి ఉన్నారు. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. సో.. పార్ల‌మెంటులో వైసీపీకి బ‌ల‌మైన గ‌ళం ఉన్న‌ట్టుగానే లెక్కించుకోవాలి. ఇదే విష‌యాన్ని వైసీపీ కూడా గుర్తు చేస్తోంది. రాజ్య‌స‌భ‌లో త‌మ‌కు ఉన్న ప్రాధాన్యం మ‌రిచిపోవ‌ద్ద‌ని కూడా సునిశిత హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది. అంటే.. లోక్‌స‌భలో భారీ ఎత్తున బ‌లం లేకపోయినా.. పెద్దల స‌భ‌లో వైసీపీకి ఉన్న మెజారిటీ కార‌ణంగా ఈ పార్టీ జాతీయ స్థాయిలో త‌న హ‌వాను కొన‌సాగించేందుకు అవ‌కాశం ఉంది.

సంబంధిత పోస్ట్