పెనుగొలనులో పౌష్టికాహార మాసోత్సవం

70చూసినవారు
పెనుగొలనులో  పౌష్టికాహార మాసోత్సవం
గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు రక్తహీనత గురి కాకుండా పోషకాహారం తీసుకోవాలని, చిరుధాన్యాలు, ఆకుకూరలు ప్రాముఖ్యత గురించి అంగన్వాడి కార్యకర్తలు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కార్యకర్తలు పి.వి.సాయి లక్ష్మి,కె. లింగమ్మ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్