విజయవాడ ప్రజలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి: ఎమ్మెల్యే

68చూసినవారు
విజయవాడ ప్రజలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి: ఎమ్మెల్యే
అకాల వర్షాలతో కష్టాలలో ఉన్న విజయవాడ ప్రజలకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సోమవారం సాయంత్రం చిలకలూరిపేట నుండి విజయవాడ ప్రజలకు ఆహారం, నీటి ప్యాకెట్లను సిద్ధం చేసి ప్రత్యేక వాహనంలో విజయవాడకు పంపించారు. గత 50 ఏళ్ళలో ఎన్నడూ లేని వరదలతో విజయవాడ అతలాకుతలం అయిందన్నారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్