సరైన పత్రాలు లేని 107 వాహనాలు స్వాధీనం: డీఎస్పీ

60చూసినవారు
నరసరావుపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో 107 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. వాహనాలు తనిఖీలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నరసరావుపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, గంజాయి సేవించి వాహనాలు నడుపుతున్నారన్న సమాచారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. సరైన ధ్రువపత్రాలు తీసుకొస్తే వాహనాలను రిలీజ్ చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్