విగ్రహాల నిమజ్జనం రాత్రి 10లోపు పూర్తవ్వాలి

62చూసినవారు
విగ్రహాల నిమజ్జనం రాత్రి 10లోపు పూర్తవ్వాలి
పల్నాడు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే ఉత్సవ కమిటీలు పోలీసు నిబంధన పాటించకపోతే చర్యలు తప్పవని ఆదివారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పోలీస్ శాఖ నిర్ణయించిన ప్రదేశంలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. నిమజ్జనం రాత్రి 10 గంటల్లోపే పూర్తి చేయాలన్నారు. నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్