పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రొంపిచర్ల మండలం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని తాహశీల్దార్ బి. నిర్మల మంగళవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఉండవలసిన వసతులపై ఆరా తీశారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు ర్యాంపు తదితర మౌళిక వసతులను పరిశీలించారు. వెంట రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.