ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద పోలీసులు సూచించిన విధంగా నిర్వాహకులు విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు.