మాజీసీఎం జగన్ మోహన్ రెడ్డి కి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసిన ఇంకా సిగ్గు లేకుండా అదే అబద్ధాలు మాట్లాడుతున్నాడని కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. నరసరావుపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ. అమరావతిని చంపడం కోసం ప్రకాశం బ్యారేజ్లో పడవలను అడ్డుపెట్టి అమరావతి ముంపునకు గురైందని ప్రచారం చేసి శునకానందం పొందారని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.