అమరావతి మండలం పెదమద్దూరు, ఎండ్రాయి, చావపాడు గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. మూడు రోజులుగా నిరంతరం శ్రమిస్తూ ప్రతి అవకాశాన్ని వినియోగిస్తూ సహాయక చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరు మళ్లీ సాధారణ జీవితం గడిపేలా కూటమి నాయకులు, అధికారుల సమన్వయంతో పని చేస్తామన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని అండగా ఉంటామన్నారు.