రైతుల సమస్యపై ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ధర్నాలు

63చూసినవారు
రైతుల సమస్యపై ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ధర్నాలు
రైతు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల వద్ద 25న నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి. కృష్ణయ్య పిలుపునిచ్చారు. సిపిఎం పల్నాడు జిల్లా విస్తృత సమావేశం సత్తెనపల్లి స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ జూన్‌లోనే ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఇప్పటికీ ఇవ్వలేదని, సత్వరమే అందించాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్