పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం రెవిన్యూ పరిధిలోని బీరవల్లిపాయ గ్రామంలో వర్షానికి సుమారు 5 ఎకరాల వేరుశనగ పంట నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వేరుశనగ వేసిన పంటపొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పంట బీమా నమో చేసి నష్టపరిహారం అందేలా చేస్తామని అధికారులు తెలిపారు.